మన్యం టీవీ కరకగూడెం:ఐటీసి మరియు జిల్లా పరిపాలనా విభాగం వారి సారధ్యంలో నిర్వహిస్తున్న వికేంద్రీకృత ఘనవ్యర్దాల నిర్వహణ లో భాగంగా కరకగూడెం మండల పరిధిలో గల అన్ని గ్రామపంచాయతీల కార్యదర్శులకు మండల పరిషత్ కార్యాలయంలో తడి పొడి చెత్తసేకరణ మరియు నిర్వహణపై వాష్ ప్రోగ్రాం ఐ.ఈ.సి.(ఇన్ఫర్మేషన్ ఎడ్యూకేషన్ కమ్యూనికేషన్ )శిక్ణణ ఇచ్చి శిక్షణా సామాగ్రి ,అవగాహన పుస్తకములను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీను మాట్లాడుతూ గ్రామపంచాయతీలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి ఐటిసి వారు చేస్తున్న కృషి ప్రశంశనీయమని మారుమూల మండలమైన కరకగూడెంలో స్వచ్చందంగా వారు చూపుతున్న శ్రద్దకు ధన్యవాదాలు తెలుపుతూ కార్యదర్శులు అందరు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని గ్రామాలలో తడిపొడి చెత్తను వేరుచేయుటకు గ్రీన్ అంబాసిడర్లను నియమించుకొని అన్ని గ్రామపంచాయతీల డంపింగ్ షెడ్ లలో వర్మీకంపోస్ట్ తయారుచేయటం ప్రారంభించాలని ఆదేశించుట జరిగింది.కరోనా వ్యాప్తి నేపథ్యంలో పారిశుద్యానికి ప్రాధాన్యతనిచ్చి కార్యక్రమాలు చేపట్టాలని, అందుకు తగినట్టుగా గ్రామాలలో కెమికల్స్ అందుబాటులో వుంచుకోవాలని సర్పంచులకు కార్యదర్శులకు సూచించారు, ఈకార్యక్రమంలో ఐటీసి వాష్ ప్రోగ్రాం ట్రైనర్ సందీప్ , యం.పి.ఓ.సునీల్ కుమార్, ఏ.పి.ఓ.క్రిష్ణకుమారి, వివిధ గ్రామపంచాయతీల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Post A Comment: