మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని గ్రామాలలో కొలువై ఉన్న శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయాలలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం కరోనా మహమ్మారి ఉధృతి తో నామ మాత్రంగా జరిపించారు. మరి కొన్ని గ్రామాలలో గుడి పూజారులే మమ అనిపించారు. మండలంలోని పడమట నర్సాపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయము నందు కొద్దిమంది భక్తులతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. గుడి ప్రధాన అర్చకులు పురాణం శ్రీనివాస్ శర్మ గారు,సీతారామ కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్రం మోహన్ రావు దంపతులు, ఆళ్ల శ్రీనివాస రావు దంపతులు, నాగ బిక్షపతి రావు దంపతులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: