CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సమాచారం మాకు - బహుమతి మీకు

Share it:

 


మావోయిస్టు పార్టీ నాయకుల  ఆచూకీ కోసం ఏడూళ్ల బయ్యారం పోలీసుల ప్రచారం


మన్యం మనుగడ, పినపాక: 

మావోయిస్టు పార్టీ నాయకుల ఆచూకీ కోసం ఏడూళ్ల బయ్యారం పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ మావోయిస్టులు చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, తాడ్వాయి, బయ్యారం, మంగపేట, ప్రాంతాలలో ప సంచరిస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని, ఈ ప్రాంతాలకు చెందిన పౌరులు ఎవరైనా వీరిని గుర్తించి, తమకు సమాచారం అందించినట్లు అయితే వారికి ఐదు లక్షల రూపాయల నజరానా ఇవ్వబడుతుందని, పోలీసుశాఖ ప్రకటించిందని ఏడూళ్ల బయ్యారం ఎస్ ఐ టి  వి ఆర్ సూరి అన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతాలలో గోడ పత్రికల ద్వారా, మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులతో కూడిన ఫోటోలతో ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఏడూళ్ల బయ్యారం సిఐ దోమల రమేష్ మాట్లాడుతూ,గోడ పత్రికలలో గల వ్యక్తులు ఎవరైనా తారసపడితే వెంటనే పోలీసు శాఖ వారికి సమాచారం అందించి,ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగస్వాములు కావాలని అన్నారు. సమాచారం తెలియజేసిన వారి వివరాలు చాలా గోప్యంగా ఉంచబడతాయి అని ఈ సందర్భంగా అన్నారు.ఎవరైనా తారసపడిన వెంటనే గోడపత్రిక లో గల ఏదైనా నెంబర్ కి ఫోన్ చేసి వివరాలు తెలియ పరచాలి అని అన్నారు

Share it:

TELANGANA

Post A Comment: