👉గుండాల మండలం అడవిరామారం గ్రామంలో ఆదివాసీలకు ఇంటికొక వాటర్ ఫిల్టర్ ను పంపిణీ చేసిన ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్.
మన్యం టీవీ,గుండాల :
గుండాల పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుమూల గుత్తికోయ గ్రామమైన అడవిరామారంలో ఈ రోజు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పి రవీందర్ రెడ్డి,గుండాల సిఐ శ్రీనివాస్,ఎస్సై రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. గుండాల నుండి అడవిరామారం గుత్తికోయ గ్రామానికి చేరుకున్న జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపిఎస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదివాసీలకు వాటర్ ఫిల్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లాలోని వలస ఆదివాసీల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారు.జిల్లాలోని ఆదివాసీ ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని వారికి పరిశుభ్రమైన నీటిని అందించేందుకు ఈ వాటర్ ఫిల్టర్లను పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని యువత ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని యువతకు కావలసిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేయడంలో జిల్లా పోలీసు శాఖ తరపున ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేశారు.అనంతరం అక్కడ పాల్గొన్న ఆదివాసీల సమస్యలను స్వయంగా తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి అట్టి సమస్యలను కూడా వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం ఆదివాసీలతో కలిసి ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ అక్కడ ఏర్పాటు చేసిన సహపంక్తి విందులో పాల్గొన్నారు.
Post A Comment: