CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏ.పీ.ఆర్. ( బిల్ట్ )ఆక్సిజన్ ప్లాంట్ సందర్శించిన ఐ.టి. సి భద్రాచలం అధికారులు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

జిల్లా కలెక్టర్, ఐ. టి. డి. ఏ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు మంగపేట మండలం లోని కమలాపురం ఏ. పీ. ఆర్. (బిల్ట్ ) కంపెనీ ని           ఐ.టి.సి. భద్రాచలం కంపెనీ అడ్మిన్ చెంగల్ రావు సందర్శించి   బిల్ట్ కంపెనీ ఎప్పుడు ముసివేయబడినది ఇప్పటికి ఈ ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా సురక్షితమైన నాణ్యమైన ఆక్సిజన్ తయారు చేయవచ్చా, అలా చేయాలంటే ఆక్సిజన్ సామర్థ్యం ఎంత అవసరం, బిల్ట్ కంపెనీ ఆక్సిజన్ ప్లాంట్ సామర్థ్యం 93% శాతం అని కొంతమంది కంపెనీ ఉద్యోగులు చెబుతున్నారు ఆ సామర్థ్యం సరిపోతుందా లేదా, ఇటువంటి అన్ని కోణాలనుండి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఆక్సిజన్ ప్లాంట్ నుండి పునరుద్దరణ,ఆక్సిజన్ పునరుత్పత్తి చేయాలంటే మరల ఉత్పత్తి కారకాలైన, శ్రమ మూలధనంతో పాటు ఆర్ధిక వనరులు, కరెంట్, నీటి సౌకర్యం మొదలగు ఎన్నో  అవసరం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్ర విచారణ జరిపి కలెక్టర్ కు నివేదిక అందజేయనున్నారు. ఈ కార్యక్రమం లో భద్రాచలం ఐ.టి.సి. అడ్మిన్ చెంచల్ రావు తో పాటు టెక్నికల్ అసిస్టెంట్ శ్రీపతి మండలం అభివృద్ధి అధికారి, రెవిన్యూ ఇన్స్పెక్టర్,పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవిన్యూ అధికారి, మరియు డాక్టర్స్, గ్రామ పంచాయతీ కమలాపురం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: