మన్యం టీవీ, దమ్మపేట:
తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా వెలువడిన మన్యం మనుగడ ప్రత్యేక సంచికను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రేగా కాంత రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అభివృద్ధి పనులు, ముందు చూపు ప్రతి ఎమ్మెల్యేకు ఆదర్శం. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆశీస్సులు రేగాకు పుష్కలంగా ఉన్నాయి. ఆదివాసి మనుషుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన గొప్ప నాయకుడిని కొనియాడారు. జన్మదినం సందర్భంగా వచినటువంటి ప్రత్యేక సంచికను అందించిన అశ్వరావుపేట మన్యం టీవీ ప్రతినిధి దాది చంటి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షడు దొడ్డాకుల రాజేశ్వరావు, యువకుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: