హైదరాబాద్ :
తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో 2 మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే వార్డుల వారిగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. జడ్చర్ల – బీసీ మహిళ, నకిరేకల్ – బీసీ జనరల్, కొత్తూరు – జనరల్ మహిళకు కేటాయించారు. ఇక వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట మున్సిపాలిటీకి రిజర్వేషన్ల జాబితాను సంబంధిత అధికారులు విడుదల చేశారు. శుక్రవారం నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 30న పోలింగ్ జరగనుంది. మే 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Post A Comment: