మన్యం టీవీ కొత్తగూడెం
ఏప్రిల్ 13,
మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావనం గ్రామం వద్ద ఎస్సై మహేష్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టడం జరిగింది.అదే సమయంలో కొత్తగూడెం నుండి ఖమ్మం వైపుగా వెళుతున్న AP28 W 8974 అను నంబరు గల ఐచరు వ్యాను ను ఆపి తనిఖీ చేయగా 22 క్వింటాళ్ల(2200కేజీలు) బరువు గల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఇట్టి గంజాయి విలువ సుమారుగా 3,31,50,000/-(మూడు కోట్ల ముప్పై ఒక్క లక్ష యాభై వేలు) రూపాయలు ఉంటుంది.అనంతరం వెహికల్ డ్రైవర్ అయిన షేక్ మహబూబ్ S/o.ఉస్మాన్,వయస్సు : 35 సం",R/o.టోలిచౌకి ను విచారణ చేపట్టగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా చింతూరు అటవీ ప్రాంతం నుండి ఇట్టి గంజాయిని హైదరాబాద్ నకు తరలిస్తున్నట్లు తేలింది. ఇట్టి గంజాయిని తరలించడంలో నిందితుడికి సహకరించిన మిగతా వారిని పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారు. కార్ నెంబర్.37/2021 U/s.8(c) r/w 20(b) of NDPS యాక్ట్ ప్రకారం చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం నిందితుడు షేక్ మహబూబ్ ను జ్యూడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరుగుతుంది.
భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్న చుంచుపల్లి ఎస్సై మహేష్ మరియు తన సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది.
Post A Comment: