మన్యంటీవీ,అశ్వారావుపేట:
మండల పరిదిలోని నారాయణపురం గ్రామ పంచాయితీలో చిన్నంశెట్టి శోభానాద్రి మరియు వెంకయమ్మ వారి సోజన్యంతో ఏర్పాటు చేసిన యూత్ క్రికెట్ టోర్నమెంట్ ను జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం జారీచేసిన కోవిడ్ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని టోర్నమెంట్ నిర్వహించలని కోరారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మంచి క్రీడా స్పూర్తితో స్నేహ పూర్వకంగా ఆడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహక అధ్యక్షుడు చిన్నంశెట్టి మురళీమోహన్, జక్కుల రాంబాబు, ఎంపీటీసీ పాయం రమేష్, పంచాయతీ ఉప అధ్యక్షుడు చిన్నంశెట్టి శ్రీనివాస్, వడ్లనపు కోటేశ్వరరావు, బండి సతీష్, వలి మరియు కమిటీ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు.
Post A Comment: