మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలంలో జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు పర్యటించారు. వ్యవసాయ సహకార సంఘం గుంపెన ఆధ్వర్యంలో మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మరియు కేంద్రాల వద్ద రైతులకు నల్ల పట్టాలు అందుబాటులో ఉంచాలని , సకాలంలో టోకెన్లు అందే విధంగా చూడాలని, ధాన్యం బ్యాగుల (గన్ని బ్యాగులు) కొరత లేకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలని, పిఎసిఎస్ గుంపెన సొసైటీ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, ఏవో అనూష, ఏఈఓ ప్రశాంత్, సంధ్య లకు సూచనలు చేశారు. ఈ పర్యటనలో వారి వెంట తాహసిల్దార్ కె భద్రకాళి, రెవిన్యూ సిబ్బంది, వ్యవసాయ సహకార సంఘం సిబ్బంది, రైతులు రాములు, మల్లిఖార్జున్ రెడ్డి , సురేష్ తదితర రైతులు ఉన్నారు.
Post A Comment: