CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్నపురెడ్డిపల్లి మండలంలో కోరలు చాస్తున్న కరోనా

Share it:

 


(ఇతర రాష్ట్రాల వలసకూలీల తో వ్యాప్తి చెందింది అంటున్న వైద్యాధికారులు)

 మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. స్థానిక వైద్యాధికారులు శనివారం నాడు మర్రిగూడెం గ్రామ సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్ క్యాంపు వద్ద  201 మందికి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 21 మందికి పాజిటివ్ వచ్చింది.అందులో సీతారామ ప్రాజెక్ట్ పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర , జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్, చత్తీస్గడ్ , ఒరిస్సా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు 18 మంది కాగా, మిగిలిన వారు అబ్బుగూడెం ,పెంట్లం , మర్రిగూడెం గ్రామాల వారు. వైద్య సిబ్బంది , స్థానికులు మాట్లాడుతూ అత్యధిక పాజిటివ్ కేసుల్లో సీతారామ ప్రాజెక్టులో పనిచేస్తున్న వలస కార్మికులు అయినందున ఇతర రాష్ట్రాల నుంచే మన మండలంలో కరోనా వ్యాప్తి చెందుతుందని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ప్రియాంక మాట్లాడుతూ మొదటి దశను దాటి, రెండో దశలో కోరలు చేస్తున్న కరోనా బారిన పడకుండా అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, సామాజిక దూరం పాటించాలని, ముక్కు మూతికి మాస్కులు ధరించాలని కోరారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు బయట సంచరిస్తే భద్రాచలం, మణుగూరు కోరంటైన్ సెంటర్లకు తరలిస్తామని తెలిపారు. ఈ కరోనా నిర్ధారణ పరీక్షల కార్యక్రమంలో డిపిఎంవో-ఐ వెంకటేశ్వరరావు , హెచ్ఈఓ-పోలెబోయిన కృష్ణయ్య , హెచ్వి-సారారాణి, ల్యాబ్ టెక్నీషియన్-కిరణ్, హెల్త్ అసిస్టెంట్-కోటేశ్వరరావు, రాందాస్, ఏఎన్ఎం-ఎస్ పుష్ప, జయ, పూజ ,ఆశా కార్యకర్తలు-ఎస్ సునీత, లక్ష్మి ,కుమారి, వాణి, పి సునీత , రాహేలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: