మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ఎల్చిరెడ్డిపల్లి పంచాయతీ లో గల పినపాక మండల టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు పోలిశెట్టి సత్తిబాబు.ఎల్చిరెడ్డిపల్లి పంచాయతీ పరంగా ఏ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా, ముందడుగు వేసే మనస్తత్వం కలవాడు. కరోనా ప్రారంభమైనప్పటి నుండి కరోనా బాధితులకు బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ, పేదలకు అండగా ఉంటున్నారు. శుక్రవారం నాడు పంచాయతీ పరిధిలో కరోనా కేసులు నమోదవగా వారి ఇంటికి నేరుగా వెళ్లి బియ్యము నిత్యావసరాలను అందించి, మానవత్వాన్ని చాటుకున్నారు. పంచాయతీ పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేసి ప్రజల మన్ననలు పొందుతూ పార్టీకి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కొప్పల సాగర్, అశోక్ ,బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: