మన్యం న్యూస్ గుండాల: ప్రజలందరూ తప్పకుండా కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని గుండాల తాసిల్దార్ ఆర్ రమేష్ ఒక ప్రకటనలో కోరారు రాష్ట్ర ప్రభుత్వం కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాత్రి 9నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది అని ప్రజలందరూ దానికనుగుణంగా సహకరించాలన్నారు ప్రభుత్వం జీవో నెంబర్ 83 ను సవరిస్తూ ఉత్తర్వులను దారి చేసిందన్నారు ప్రజలు పెళ్లిళ్లు ఫంక్షన్లు ఎటువంటి కార్యక్రమాలను జరపకుండా సర్పంచులు ఎంపీటీసీలు గ్రామాల్లో చాటింపు వేయాలని అన్నారు మాస్కులు లేకుండా ఎవరు కూడా రోడ్లమీద తిరగకూడదని అన్నారు
Post A Comment: