మాస్క్ ధరించకుండా తిరిగే వారికి ఈ చలాన్ ద్వారా 1000/-రూపాయలు జరిమానా విధించాలని ఏటూరునాగారం ఏ.యస్.పి శ్రీ గౌస్ అలం గారి ఆదేశాలు జారీ....
●వెంకటాపురం భద్రాచలం ప్రధాన రహదారిపై మాస్కులు లేకుండా వ్యక్తుల కు జరిమానా విధిస్తున్న వెంకటాపురం సి.ఐ శివప్రసాద్
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించే వారికి వేయి రూపాయల జరిమానా విధించబడుతుందని వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.శివప్రసాద్ గారు ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేసారు. వెంకటాపురం, వాజేడు మండలాల ప్రజలందరూ తప్పనిసరిగా నిత్యం మాస్కులు ధరించి,భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నో మాస్క్ నో ఎంట్రీ విధానాన్ని మెడికల్ షాపులు, థియేటర్ల యాజమాన్యాలు, ప్రైవేట్ సంస్థలు అన్ని విదిగా పాటించాలన్నారు.ఎవరైనా మాస్కులు లేకుండా రోడ్లపైకి వస్తే G.O no.82 ఉత్తర్వుల ప్రకారం 51(బి) సెక్షన్ ఆఫ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం పోలీసు వారు ఈ చలాన్ ద్వారా వారికి 1000/- రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.కావునా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించడంతో పాటు విధిగా మాస్కులు ధరించి పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Post A Comment: