మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: మండలంలోని అన్నపురెడ్డిపల్లి, రాజాపురం,ఊటుపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి అనూష సందర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చే ధాన్యంలో తాలు, చెత్త, మట్టిపెళ్లలు లేకుండా ధాన్యంలో తేమ 17 శాతం ఉండే విధంగా చూసుకోవాలి అని, రైతులకు తెలియజేశారు. ఈ సందర్శణలో మండల వ్యవసాయ అధికారి అనూష వెంట, ఏఈఓ-ప్రశాంత్ మరియు రైతులు ఉన్నారు.
Post A Comment: