👉టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తల సమావేశం
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తల సమావేశం ను ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులకు,కార్యకర్తలకు, నాయకులకు,ప్రజా ప్రతినిధులకు పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేశారు.ప్రతి ఒక్క కార్యకర్త మండల అధ్యక్షులు,ముఖ్య నాయకుల సమన్వయం తో గ్రామ కమీటీ,బూత్ కమిటీ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య,జడ్పీటీసీ పొశం నర్సింహారావు,అన్ని మండలాల ఎంపీపీలు,జడ్పీటీసీ లు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు,వర్కింగ్ ప్రెసిడెంట్ లు,ముఖ్య నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: