కరోనా సెకండ్ వేవ్తో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో టీఎఫ్పీసీ సినిమా షూటింగ్స్ విషయంలో కొత్త మార్గదర్శకాలతో ప్రెస్ నోట్ విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం అత్యవసర షూటింగ్స్ కు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది.
తాజా రూల్స్ ప్రకారం అన్ని షూటింగ్స్ బృందాలు కేవలం 50 మంది సినీ కార్మికులను మాత్రమే విధులకు తీసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కూడా పరిమిత సిబ్బందిని వినియోగించాలి. రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు రూపొందించిన గైడ్లైన్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది. ఇప్పటికే కరోనా వేవ్తో మాధ్యమిక, హై బడ్జెట్ సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. పలు పెద్ద చిన్న సినిమాల విడుదల తేదీలు కూడా వాయిదా వేశారు.
Post A Comment: