CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా పోడు భూములకు పట్టాలు సాధించి తీరుతాం.

Share it:

 


తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు అలెం కోటి

మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలోని వీరపూరం క్రాస్ రోడ్డు వద్ద కొమరం భీం విగ్రహం వద్ద ఇంద్రవెల్లి అమరులకు నివాళి కార్యక్రమం తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు అలెం కోటి అధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అథితిగా తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ 1981 ఏప్రిల్ 20 న ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఆటవీ భూములపై హక్కు కోసం సభ నిర్వహిస్తున్న క్రమంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదట సభకు అనుమతి ఇచ్చినట్టు ఇచ్చి దాని తిరస్కరణ చేశారని తెలుగు భాష రాని గోండులు అర్థంకాక సభకు హాజరు అవ్వడంతో అక్కడ జరిగిన హింసలో 60 మంది ఆదివాసీ గిరిజన గోండులు మరణించారు అన్నారు.అటవీ భూముల హక్కులకోసం రక్తం చిందించిన గోండు బిడ్డల ఆత్మ శాంతి కోసం నివాళ్లు అర్పించవలసిన భాద్యత మన ఆదివాసీలందరిపై ఉందన్నారు.పోడుభూముల పట్టలకోసం మా సంఘం పోడు సాగుదారులకు అండగా ఉంటాం అన్నారు.ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు సూతరి నాగేశ్వరరావు జిల్లా నాయకులు కొమరం రాంగోపాల్ వజ్జా నర్సంహరావు .మండల అధ్యక్షులు ఊకే గణేష్ ఆదినారాయణ కుంజ క్రిష్ణా ములుగు జిల్లా ఉపాధ్యక్షులు ఎట్టి ప్రకాష్ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: