మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం భద్రాచలం పరిధిలో గల గత కొంత కాలంగా కుల మరియు ఆదాయ సర్టిఫికెట్స్ రాక ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని వి వై ఎస్ ఎస్ వ్యవస్థాపకులు గుమ్మడి డి రాజు ఉన్నారు. భద్రాచలం మండల రెవెన్యూ కార్యాలయం లో విధులు నిర్వహిస్తున్న ఆర్ ఐ కుల ఆదాయ సర్టిఫికెట్స్ మంజూరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నెలరోజులుగా పెండింగ్లో ఉన్న సర్టిఫికెట్ రాక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు అని అన్నారు తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ప్రజల పట్ల మరియు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆర్ ఐ పై తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వి వై ఎస్ ఎస్ నాయకులు రమణ, శివ, విష్ణు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: