మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, పెద్దిరెడ్డిగూడెం(ఎర్రగుంట) గ్రామంలోని అంగన్వాడీ మినీ సెంటర్ వద్ద చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్(సిడిపిఓ)-సిహెచ్ నిర్మలజ్యోతి సమావేశం ఏర్పాటు చేసి అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్స్, పోషణ అభియాన్ టీం వారికి, నూతనంగా ప్రారంభించిన పోషణ ట్రాకర్ యాప్ ఆవశ్యకత గురించి మరియు ప్రతి ఒక్క అంగన్వాడి సెంటర్లో యాప్ ద్వారా బాలింత మహిళలు , గర్భిణీ మహిళలు, 0 నుండి 6 సంవత్సరాల పిల్లల, కిశోర బాల,బాలికల వివరాలను యాప్ లో ఏ విధంగా నమోదు చెయ్యాలో వివరించారు. ముఖ్యంగా ఖచ్చితమైన సమాచారాన్ని అందరూ నమోదు చేయాలని సూచించారు. యాప్ వలన బాలింత మహిళలకు, గర్భిణీ మహిళలకు సరైన పోషకాహారం అందుతుందని తెలియజేశారు. అంతేకాకుండా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ, రోజురోజుకు పెరుగుతున్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు , కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రోగ్రాం గురించి మాట్లాడారు. ఈ సమావేశంలో మూడు మండలాల సూపర్వైజర్లు- ఎం లక్ష్మి , జి అరుణ , డి శకుంతల , పోషణ అభియాన్ కోఆర్డినేటర్- రాజ్యలక్ష్మి , అంగన్వాడీ టీచర్స్- విజయ , కె సుజాత, ఝాన్సీ , శ్రీదేవి తదితర టీచర్లు పాల్గొన్నారు.
Post A Comment: