ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని టిఆర్ఎస్ భవన్ లో మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జడ్పీటీసీ పొశం. నర్సింహారావు పాల్గొన్నారు. అనంతరం ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ ఉగాది పచ్చడి ని తినిపించుకున్నారు.ఈ సందర్భంగా ప్రపంచంలో కరోనా చీకట్ల ను తొలగిపోయి,తిరిగి మంచి రోజులు రావాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఆనందంగా వుండాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,ఉప సర్పంచ్ పుచ్చకాయల.శంకర్,పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి. నవీన్,పట్టణ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్, టిఆర్ఎస్ నాయకులు ముద్దంగుల.కృష్ణ,నైనారపు.నాగేశ్వరరావు,వెంకట్ రెడ్డి, మేకల.రవి,యువజన నాయకులు గుర్రం.సృజన్, జక్కం.రంజిత్,బొశెట్టి.రవి ప్రసాద్,సురేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: