-కాంగ్రెస్ సీనియర్ నాయకులు.
మన్యం టీవీ మంగపేట.
ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు మంగపేట మండలం లో అన్ని గ్రామాల్లో యూత్ కమిటీలు వేయడం జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ రాజుపేట సీనియర్ నాయకులు మాట్లాడుతూ అధికారంతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకం అయి ప్రజల ఆధారాభిమానాలు సాధించాలి. ప్రతి ఒక్క కార్యకర్త సేవా దృక్పధం కలిగి ఉండాలి. పార్టీకోసం ప్రతి ఒక్కరూ కస్టపడి పని చేయాలి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకరావడమే లక్ష్యంగా మన కార్యచరణ ఉండాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేర్కొన్నారు.
ఇట్టి కార్యక్రామం లో భాగంగా రాజుపేట గ్రామం లో మంగపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మురుకుట్ల నరేందర్ ఆధ్వర్యంలో గ్రామ యూత్ అద్యక్షున్ని ఎన్నుకున్నారు. గ్రామ యూత్ అధ్యక్షునిగా కరకపల్లి సాంబమూర్తిని ఎన్నుకున్నారు.ప్రతి ఒక్కరు పార్టీ కోసం పనిచేయాలని,ఎమ్మెల్యే సీతక్క అన్ని విధాలుగా అండదండగా ఉంటారని అన్నారు. కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ యూత్ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్సార్ ఖాన్,సీనియర్ నాయకులు ఏనుముల రాఘవరెడ్డి, కర్రీ నాగేంద్రబాబు, సమ్మయ్య చందర్ల పాటి శ్రీనివాస్,మాల్లారెడ్డి, బొనుగు హనుమంతరావు, పయ్యావుల బాబురావు,శ్రీను, నరేందర్ రెడ్డి, కర్రి చిన్నపుల్లయ,వీరారెడ్డి,కరకపెల్లి సాంబమూర్తి,రాజరత్నం,రాజేష్,పల్లికొండశ్రీవర్మ, ప్రశాంత్,దార్ల యలమందరావు,సురేష్,పాకాల మధు,ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: