మన్యం టీవీ టీవీ మంగపేట.
కరోనా సెకండ్ వేవ్ మృత్యు ఘంటికలు మోగిస్తున్న ఇటువంటి తరుణంలో ప్రజలు అవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఉండాలి. ముఖ్యంగా యువత సెలవులు కావడంతో సంతోషంగా సినిమాలు, షికార్లు చేస్తున్నారు ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. విపరీతమైన వేగంతో కరోనా సెకండ్ వేవ్ వస్తున్న ఇప్పుడు బయటకు వచ్చిన ప్రమాదమే అని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్న కూడా ప్రజలు పెడ చెవిన పెడుతున్నారు. దయచేసి ప్రజలు మనిషికి మనిషికి మధ్య దూరం పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా వాడుతు శానిటైజర్ ఉపయోగించి మన ముందు పొంచి ఉన్న ప్రమాదన్ని కొంతవరకైనా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం వారు చెప్పే కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలి పోలీస్ వారికీ ఆరోగ్య శాఖ వారికీ సహకరించాలి.45 సంవత్సరాలు నిండిన వారు తప్పనిసరిగా కోవిడ్ వాక్సిన్ తీసుకొని మన ఆరోగ్యం కాపాడుకుందాం అని ఈ సందర్బంగా ములుగు జిల్లా జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రి శ్యాంబాబు పేర్కొన్నారు.
Post A Comment: