అనుమానాస్పద స్థితిలో యువకుని మృతి
మన్యం మనుగడ, పినపాక:
దూరప్రాంతం నుంచి స్నేహితులు వస్తున్నారు, కలిసి వస్తాను అని తల్లిదండ్రులకు చెప్పి, అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన సంఘటన పినపాక మండలం గడ్డం పల్లి పంచాయతీ లో చోటుచేసుకుంది. గడ్డం పల్లి గ్రామానికి చెందిన గొడిశాల బక్కయ్య కు ముగ్గురు కుమారులు. అందరిలో చిన్నవాడైన గొడిశాల హరీష్ ( 23), సోమవారం రోజున తన స్నేహితులు వస్తున్నారని,
ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద కు వెళ్తున్నాను అని చెప్పి, ఉదయం 11 గంటల 30 నిమిషాలకు బయటికి వెళ్ళిన హరీష్ మధ్యాహ్నం మూడు గంటలు అయినప్పటికీ, ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులమైన మేము ఫోన్ చేసినప్పటికీ అవతల వైపు నుండి సమాధానం లేదు అని, రాత్రి వరకు వరకు వెతికినా ప్రయోజనం లేకుండా పోయిందని,సంఘటనా స్థలానికి చేరుకున్న ఏడేళ్ల బయ్యారం సిఐ దోమల రమేష్, ఎస్ ఐ టి వి ఆర్ సూరికి తెలియజేసి
హరీష్ తండ్రి ఆవేదన వెలిబుచ్చారు. మంగళవారం రోజున గ్రామస్తుల ద్వారా తన కొడుకు భూపాలపట్నం చెరువు, గడ్డం పల్లి గ్రామాల మధ్య గల పొలంలో విగతజీవిగా పడి ఉన్నాడని తెలుసుకుని, అక్కడికి వచ్చి చూసి దిగ్భ్రాంతికి గురయ్యామని, దరఖాస్తులో తెలియపరిచారు. ఇదే విషయాన్నిఏడూళ్ల బయ్యారం ఎస్ఐ టి వి ఆర్ సూరికి తెలియజేశారు.విషయం తెలిసిన వెంటనే పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏడూళ్ల బయ్యారం ఎస్ఐ టీవీ ఆర్ సూరి శవానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం తరలించారు. ఈ విషయమై దర్యాప్తు చేసి, వివరాలు తెలుసుకుంటామని ఎస్సై టి వి ఆర్ సూరి అన్నారు.
Post A Comment: