మన్యం టీవీ కరకగూడెం:తేది 18 ఆదివారం నాడు మండలపరిదిలోని వీరపూరం క్రాస్ రోడ్డు వద్ద కొమరం భీం విగ్రహావిష్కరణ ,ర్యాలీ ,బహిరంగ సభను ఆదివాసీ పెద్దలు యవతి యువకులు విజయవంతం చెయ్యాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు అలెం కోటి పిలుపునిచ్చారు. అనంతరం విలెకర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ కరకగూడెం అంబేద్కర్ సెంటర్ నుండి వీరపూరం క్రాస్ రోడ్డు వరకు ఆదివాసీ సంప్రదాయ నృత్యాలతో ఆదివాసీ ఎమ్మెల్యే లు,ప్రోపెసర్లు,ప్రజాప్రతినిధులు నడుమ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భారీగా ర్యాలీ నిర్వహించి కొమరం భీం విగ్రహావిష్కరణ ఉంటుందని ,ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభ ఉంటుందన్నారు.ఈ కార్యక్రమనికి ఆదివాసీ యువత పెద్దలు ఆదివాసీ నాయకులు ప్రజాప్రతినిధులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, ఆదివాసీ సంఘాలు పిలుపు నిలవడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు సూతరి నాగేశ్వరరావు సిద్దబోయిన శ్రీకాంత్ అరెం అరుణ్ కుమార్ కొమరం రాంగోపాల్ వజ్జా నర్సంహరావు ఊకే గణేష్ పాల్గొన్నారు.
Post A Comment: