మన్యం టీవీ ములుగు:
మంగళవారం ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం కేంద్రములో పి ఏ సీ స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కొనుగోలు కేంద్ర కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య స్థానిక పిఏసీఎస్ ఛైర్మెన్, స్థానిక యంపీపి, జడ్పిటిసి ములుగు డీయస్ఓ తో కలిసి ప్రారంభించారు. అనతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శ్రామిక వర్గాలకు అండగా నిలిచి దేశంలో ఎక్కడా లేని విదంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది అని అన్నారు. ప్రభుత్వ అధికారులు రైతులకు అండగా నిలిచి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేవిదంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Post A Comment: