మన్యం టీవీ, అశ్వరావుపేట:
తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ద్వారా వెలువడిన మన్యం మనుగడ పత్రిక ద్వారా వెలువడిన మన్యం మనుగడ ప్రత్యేక సంచికను అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రేగా కాంత రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మంచి మనసున్న మహారాజు రేగా కాంతారావని కొనియాడారు. జన్మదినం సందర్భంగా వచినటువంటి ప్రత్యేక సంచికను అందించిన అశ్వరావుపేట మన్యం టీవీ ప్రతినిధి దాది చంటి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొర్సా వెంకటేశ్ దొర, కట్టం ప్రసాద్, కుంజా చిన్నబాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: