మన్యం టివి మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం,బుగ్గ గ్రామ పంచాయతీ ప్రజలు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కలిశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని విప్ రేగా ను కోరగా,స్పందించిన విప్ రేగా కాంతారావు సంబంధిత అధికారులతో చరవాణి లో మాట్లాడారు.పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పొశం.నరసింహారావు, ఎంపీపీ కారం.విజయ కుమారి, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ రామకృష్ణ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: