మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలంలోని రాఘవ నిలయంలో జిల్లా ఎన్నికల అధికారి షరీఫ్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా జిల్లా లోని 17 మండలాల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు,ఐదుగురు శాశ్వత సభ్యులు మొత్తం 56 మంది ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.జిల్లా అధ్యక్షులుగా ఇల్లందుకు చెందిన మారుతి ప్రకాష్,ప్రధాన కార్యదర్శిగా పినపాక మండలం నుండి కీసర సుధాకర్ రెడ్డి ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో లో జిల్లా నాయకులు రామకృష్ణ, వేముల నర్సింహారావు,శోభన్ బాబు,పూర్ణచందర్ రావు, మరియు జిల్లాలోని పదిహేడు మండలాల అధ్యక్ష కార్యదర్శులు,కోశాధికారులు పాల్గోన్నారు.
Post A Comment: