కొమరం భీం విగ్రహాన్నిఆవిష్కరించిన ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మాజీ శాసనసభ్యులు పాయం వెంకటెశర్లు చందా లింగయ్య దొర తుడుందెబ్బ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వట్టం నారాయణ
మన్యం టీవీ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని వీరపూరం క్రాస్ రోడ్డు వద్ద విగ్రహవిష్కరణ సందర్భంగా భట్టుపల్లి గ్రామం నుండి వీరపూరం క్రాస్ రోడ్డు వరకు ఆదివాసీ గిరిజన సంప్రదాయాలతో కొమ్ము నృత్యాలతో బరిగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ తుడుందెబ్బ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మాజీ శాసనసభ్యులు పాయం వెంకటెశర్లు మాజీ జిల్లా చైర్మన్,శాసనసభ్యులు చందా లింగయ్య దొర తుడుందెబ్బ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వట్టం నారాయణ దొర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎర్పటుచేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ ఆదివాసీ ఉద్యమాల వీరుడు కొమరం బీం ఆరోజు అయన పాలకులమీద చేసిన పోరాటం చేసిన ఘనత కోమరం భీం అన్నారు.జల్,జంగిల్, జమీన్ అంటు జంగ్ సైరన్ ఊది తుడుం మోగించి,నిజా సైనికులతో పోరాడి వీరమరణం పొందిన మహనీయుడు కొమరం భీం అన్నారు.రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కులను మనం ఎందుకు కొలుపోతున్నాం అంటు ఆదివాసీలను ప్రశ్నించరు.ఆదివాసీ చట్టలు అమలుకు ఎందుకు నోచుకొవటంలెదన్నారు.మన హక్కులు మనం అనుబవిచాలంటే ఆదివాసీ యువత ముందుగా చదువుకోవలన్నారు.కొమరం భీం అనాడు ఉద్యమాలు చెస్తె ఈనాడు వాటిని మనం ఆ హక్కులను అనుభవిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు అల్లెం కోటి తుడుందెబ్బ రాష్ట్ర సలహాదారులు పొడుగు శ్రీనాద్ సాంస్కృతిక రాష్ట్ర కార్యదర్శి ఆగబోయిన రవి కరకగూడెం జడ్పిటిసి కొమరం కాంతారావు పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ సర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులు తోలెం నాగేశ్వరరావు బూర్గంపాడు వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు మణుగూరు డివిజన్ ఎఈ డబ్ల్యుసిఎ డివిజన్ అధ్యక్షులు పోలెబోయిన అనిల్ కుమార్ సర్పంచ్ లు పోలెబోయిన శ్రీవాణి గొగ్గలి నాగమణి పోలెబోయిన సమ్మక్క ఇర్ప విజయ్ కుమార్ కుంజ వసంతరావు తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు సూతరి నాగేశ్వరరావు వివిధ సంఘల ఆదివాసీ నాయకులు ఆదివాసీ యువత పెద్దలు పాల్గొన్నారు.
Post A Comment: