మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలంలో రైతులు, ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి వచ్చిందని సంతోషించాలో, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానందుకు దుక్కించాలో తెలియని పరిస్థితి. అన్నదాతలు తమ కష్టాన్ని పండించిన పంట కోశాక, పంటను సోమ్ము చేసుకొని మురిసిపోతారు. అటువంటి పరిస్థితులలో వరి కోతలు ప్రారంభించి పది రోజులైనా, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానందున, కొంతమంది రైతులు దళారుల రేటుకే ధాన్యము అమ్ముకోగా,మరి కొంతమంది రైతులు యార్డుల వద్ద ధాన్యం ఆరబెడతూ, దళారుల చేతిలో చితికి పోకూడదని, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూపులు చూస్తున్నారు. సోమవారం రోజు ప్రకృతి వైపరీత్యం వల్ల కురిసిన చిరుజల్లులతో రైతులు తమ ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు టార్పాలిన్ పట్టాల కోసం పరుగులు తీశారు. ఇప్పటికైనా రైతులు నష్టపోకుండా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై రైతులకు టార్పాలిన్ పట్టాలు ఇవ్వాలని, పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Post A Comment: