ఒకేరోజు 13 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు శివకుమార్
మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం తోగ్గూడెం గ్రామంలో కరోనా పరీక్షలు సోమవారం చేయడం జరిగినది. సుమారు 167 మందికి కి పరీక్షలు చేయగా 13 మందికి పాజిటివ్ గా నిర్ధారణ చేయడం జరిగిందని డాక్టర్ శివకుమార్ తెలిపారు.
పినపాక డాక్టర్ శివకుమార్ కరోనా వచ్చిన వారిని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భాదితులలో 5గురిని మణుగూరు క్వారంటైన్ కి పంపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తోగ్గూడెం ఎంపీటీసీ సత్యం , సర్పంచ్ కల్తీ శ్రీలత , లక్ష్మ య్య ,తెరాస నాయకులు చిట్టిమళ్ళ సతీష్ చారీ , సల్లూరి లక్ష్మయ్య, పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: