- కరోనాగ్రహితునికి రూ.. 20వేలు నిత్యవసర సామాగ్రి వితరణ
మన్యం టీవీ చర్ల
చర్ల మండలంలో తమతోపాటు చిన్ననాటి నుండి విద్యాబుద్ధులు నేర్చుకున్న
బాల్య స్నేహితురాలి భర్త కరోనా భారిన పడి అవస్థలు పడుతున్న క్రమంలో మేమున్నామంటూ ఆపన్న హస్తాలు అందించడానికి ముందుకు వచ్చారు .1993 -94 సంవత్సరం లో చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్ ఎస్ సి చదివిన పూర్వ విద్యార్థులు గత కొన్ని సంవత్సరాల నుండి నిరుపేదలను ఆదుకోవడంతో పాటు , తనతో పాటు బాల్యంలో చదువు నేర్చుకున్న బాల్య మిత్రులకు ఎక్కడ ఆపద వచ్చినా మేమున్నామంటూ ముందుకు వస్తూ వేయ ప్రయాసల కూర్చి సహాయం అందించడంలో తమదైన శైలి ప్రదర్శిస్తున్నారు. ఆ క్రమంలోనే చర్ల మండలం గుంపన గూడెంకు చెందిన హసీనాను మణుగూరు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఎస్ కే సలీం 1998లో సంవత్సరంలో వివాహం చేసుకున్నారు ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. హసీనా భర్త 5 రోజుల క్రితం కరోనా బారిన పడడంతో ఆకుటుంబాన్ని1993 -94 లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు కలసి రూ 20,000 తో పాటు, నిత్యావసర వస్తువులు, దుస్తులు వితరణ చేశారు.చర్ల నుండి మణుగూరు వచ్చి సహాయం చేసిన తన స్నేహితులకు చానా కృతజ్ఞతలు అని హసినా తెలిపింది. ఈ కార్యక్రమంలో ఎడారి రమేష్, నాగేంద్ర తిరుపతి ,బి .ప్రసాద్, శ్రీను, డి హరి నాగ వర్మ, మాధురి, లక్ష్మి, రాజేశ్వరి, రమాదేవి, విమల, మంగ వేణి తదితరులు ఉన్నారు.
Post A Comment: