CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహమ్మారి కరోనా బారినపడి చండ్రుగొండ మాజీ ఎంపీపీ గుగులోత్ బాలు నాయక్ మృతి.

Share it:

 



చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :

కరోనా వైరస్ రోజురోజుకి చండ్రుగొండ మండలంలో ఉధృతం చూపిస్తుంది. తాజాగా మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో మండల ప్రజలు  తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చండ్రుగొండ మాజీ ఎంపీపీ గుగులోత్ బాలునాయక్ కు పది రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావటంతో అతనిని కొత్తగూడెంలోని ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. దీంతో మండలం లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచి పేరు పొందిన బాలునాయక్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంట్ పక్ష నేత నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, ఎమ్మెల్యే  మెచ్చా నాగేశ్వరరావు కు మంచి సన్నిహితంగా ఉంటూ.. మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే మండలంలో ఉన్న అధికారులు, వివిధ పార్టీల నాయకులను సైతం ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను సైతం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా మండలం లో ప్రతి ఒక్కరి మన్ననలను పొందిన బాలు నాయక్ నేడు కరోనా బారినపడి మృతి చెందటంతో ఒక్కసారిగా జిల్లావ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. బాలు నాయక్ కు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ పార్లమెంట్ పక్ష నేత నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఫోన్ ద్వారా వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: