మన్యం న్యూస్ గుండాల: ఖాళీగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని పీ వై ఎల్ నాయకులు జి సక్రు అన్నారు ఆదివారం మండలం పరిధిలోని వేపాలగడ్డ గ్రామంలో ప్రగతిశీల యువజన సంఘం( పీ వై ఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిర్వహణ జనరల్ బాడీ సమావేశం కి హాజరై ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడిచిన ఉద్యోగాలను మాత్రం భర్తీ చేయటం లేదన్నారు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కోటి ఉద్యోగాలను ఇస్తామని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం కోసం ప్రయత్నాలు సాగిస్తుంది అన్నారు రైతులు గత 150 రోజుల నుండి రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కోలా లక్ష్మీనారాయణ రవి రాజు రాజశేఖర్ వజ్ర మధు పి డి ఎస్ యు నాయకులు పృద్వి గుండాల సర్పంచ్ సీతారాములు ఉపేందర్ వై వెంకన్న గడ్డం లాలయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: