మన్యం టీవీ,బూర్గంపాడు:
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి ఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా బూర్గంపాడు బాలుర వసతి గృహంలో నిర్వహించిన మహనీయుల జయంతి దశ దిన మహోత్సవ వేడుకలకు హాజరై మహనీయుల చిత్రపటాలకి పూలమాల వేసి నివాళులర్పించిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత.
అనంతరం జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ...
పేద దళిత కుటుంబంలో పుట్టి,దళితుల హక్కుల సాధనలో అవిరామ కృషి చేసి సంఘ సంస్కర్తగా తన పాలనా దక్షతతో దేశానికి విశేష సేవలందించడని,సామాజిక సమానత్వం కోసం,అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: