మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం లో కరోనా కేసులు అధికమవుతున్న సమయంలో మండలంలోని ప్రజలలో భయం ఏర్పడింది. గతంలో వ్యాక్సిన్ పట్ల ఉన్న సందేహాలను వదిలివేసి, నిర్భయంగా వ్యాక్సిన్ స్వీకరించేందుకు పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. అధికారులు ,ప్రజా ప్రతినిధులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ శివ కుమార్ లు పత్రికలలో ప్రతిరోజు వాక్సిన్ పట్ల సందేహాలను నివృత్తి చేసే సలహాలను సూచనలను గమనించిన ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైపు పరుగులు తీస్తున్నారు. మండలంలో ఇప్పటికే 80 కి పైగా కేసులు ఉన్నాయి కాబట్టి స్వీయ నియంత్రణే సరైన మార్గమని ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు.
ఈ సందర్భంగా పినపాక ప్రాథమిక కేంద్రం వైద్యులు డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ, మండలంలోని40 సంవత్సరాలు పైబడిన వారు అందరూ తప్పకుండా కేంద్రానికి వచ్చి వ్యాక్సింగ్ చేయించుకుని సురక్షితంగా ఉండాలని కోరారు. వాక్సిన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే, కోరి బాధలు తెచ్చుకున్నట్లే అని అన్నారు. గ్రామాల్లో చదువుకున్న ప్రతి ఒక్కరు, నిరక్షరాస్యులను సైతం వాక్సిన్ పై అవగాహన కలిగించాలి అని, ఈ సందర్భంగా కోరారు.
Post A Comment: