CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అకాల వర్షానికి రైతన్నకు కన్నీరు....

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు: 


అసలే రైతు అష్టకష్టాలు పడి, శ్రమించి పండించిన పంటను  అమ్ముకునే సమయానికి ఐకేపీ, సి సి ఐ,సొసైటీశాఖల ద్వారా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అనుకున్న సమయానికి పంటను కొనుగోలు చేయకపోవడంతో అమ్మకానికి సిద్ధంగా కళ్లాలలో ఉన్న ధాన్యం రాసులు పై అకాల వర్షం రూపంలో కురిసి వాన కు పలువురు అన్నదాతలుకు నష్టం వాటిల్లి కన్నీరు మాత్రమే మిగిలే పరిస్థితి ప్రస్తుతం బూర్గంపాడు మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధి ఉన్నటువంటి 17గ్రామ పంచాయతీలలో అధికశాతం వరి పంట పండిచరు. ఈ క్రమంలో అర్ధరాత్రి అకాల వర్షం సంభవించి పంట ఉన్నటువంటి కల్లలు నీటిలో కొట్టుకుపోతూ, పూర్తిగా తడిసిపోయి అయోమయంలో పడేసింది. పండిన పంటను అమ్ముకొని తన కుటుంబ పోషణను చేసుకునేందుకు నారు వేసి, కాపు కాసి కొండంత ఆశలు పెట్టుకున్న రైతులకు ప్రకృతి రూపంలో నష్టం వాటిల్లడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులలో రైతులు కొట్టుమిట్టాడుతున్నాడు. వందలాది ఎకరాల్లో వరి ధాన్యం పంట సాగు చేసి అమ్ముకునేందుకు సిద్ధం చేసిన క్రమంలో ఈ అకాల వర్షం రావడంతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లడంతో రైతులు అయోమయంలో పడిపోయినట్లు అయింది. ఇప్పటికే ప్రభుత్వ శాఖలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉన్నట్లయితే రైతులు తమ పంట నమ్ముకుని తమ ఆశించిన ఫలితాలు సాధించేవారు. కానీ కొనుగోలు కేంద్రాలు బూర్గంపాడు మండలంలో లేకపోవడంతో పలువురు రైతులు అకాల వర్షానికి తమ పంటలు నష్టపోయిరు. కాబట్టి  తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలంటూ రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: