• సబ్ ఇన్స్ స్పెక్టర్ బి రాజేష్ కుమార్.
చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.
మహమ్మారి కరోనా వైరస్ రాష్ట్రం లో ఉదృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.ఆ మాస్కే మనకు శ్రీరామరక్ష అని చండ్రుగొండ సబ్ ఇన్స్ స్పెక్టర్ బి రాజేష్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం రాత్రి మాస్క్ ధరించకుండా తిరుగుతున్న 17 మందికి ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిమానాలు విధించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, అలాగే చేతులను శానిటేజర్ లేక సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని. జనసంచారం ఎక్కువగా ఉన్న చోట సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని. తమ ఇంట్లో కూడా మాస్క్ లు ధరించాలని దీని ద్వారా ఇంట్లో ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు అని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని లేని పక్షంలో బారి జరిమానాల తో పాటు అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు..
Post A Comment: