CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడు మండలం లో కరోనా ఉగ్రరూపం ! మండల వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న కరోనా బాధితులు...

Share it:

 



మన్యం టీవీ : జూలూరుపాడు,                  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,  జూలూరుపాడు మండలం లో కరోన మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. గత సోమవారం 12, మంగళవారం 5, బుధవారం 6,  గురువారం 15, శుక్రవారం 1, నేడు శనివారం  19 , కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామల వారీగా..కరివారి గూడెం 4, కొత్తూరు 1,  చీపురుగూడెం 1, గుండెపుడి 2, కొమ్ముగూడెం 3, బేతాళ పాడు 2, పడమట నర్సాపురం 2, ఇతర మండలాలకు చెందిన వారు నలుగురు. ఇవి కేవలం జూలూరుపాడు పరీక్షా కేంద్రం నందు నిర్ధారణ అయిన పాజిటివ్ కేసులు మాత్రమే. మండలానికి చెందిన వారు వేరే ప్రాంతాల్లోని కోవిడ్ సెంటర్ల నందు వైద్య పరీక్షలు చేయించుకొని పాజిటివ్ గా వచ్చిన వారి లెక్కలు అనధికారికమే. శనివారం జూలూరుపాడు కోవిడ్ సెంటర్ నందు  102 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా  19 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రజలు విరివిగా వినియోగించుకుని కోవిడ్ టీకా వ్యాక్సిన్ ను 45 ఏళ్ల పైబడిన వ్యక్తులందరూ వేయించుకోవాలని,    అదేవిధంగా  దగ్గు, జలుబు, జ్వరం, తో ఏ మాత్రం అనుమానం ఉన్నా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.  పాజిటివ్ వచ్చినవారు తమ సిబ్బంది సూచించిన విధంగా మందులు వాడుతూ, తగు జాగ్రత్తలు తీసుకోవాలని  సి హెచ్ వో వెంకటేశ్వర్లు కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: