👉 సబ్ ఇన్స్పెక్టర్ పి తిరుపతిరావు హెచ్చరిక.
మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పి తిరుపతిరావు, మండల కేంద్రంలోని మెయిన్ సెంటర్ వద్ద ప్రజలకు, రోజు రోజుకు విస్తరించి పోతున్న కరోనా వైరస్ గురించి అవగాహన చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కరోనా వైరస్ తన శక్తిని పెంచుకొని రూపాంతరం చెంది, సెకండ్ స్టేజికి చేరిందని, మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ఈ పరిస్థితులో కరోనా నిబంధనలైన ముక్కు,మూతికి మాస్కులు ధరించడం. తరచూ శానిటైజర్ చేసుకోవడం. షాపులు, హోటళ్ళు, ఇతర ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించడం. సమూహాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించాలని, అవసరం ఉంటే తప్ప, అనవసరంగా బహిరంగ ప్రదేశాల్లో సంచరించ వద్దని, ప్రతి ఒక్కరూ కరోనాపై పలు సందేహాలను వీడి, వ్యాక్సిన్ వేయించుకోవాలని. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, జరిమానాలు విధించబడతాయి అని హెచ్చరించారు.
Post A Comment: