CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్యే రేగాను భూమి పూజకు హాజరుకావాలని కోరిన ఆదివాసి ఐక్యవేదిక నాయకులు

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:

 పినపాక మండలం లోని జానంపేట పంచాయితీలో నిర్మించతలపెట్టిన కొమరం భీమ్ విగ్రహావిష్కరణకు సంబంధించి భూమి పూజకు హాజరుకావాలని పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షుడు తోలెం శ్రీను ఆధ్వర్యంలో లో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావును క్యాంపు కార్యాలయంలో కలిసి  భూమి పూజ కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ తప్పకుండా వస్తా అని, పూజకు సంబంధించిన తేదీ వివరాలు తెలియజేయాలని ఆదివాసి నాయకులను కోరారు. ఈ సందర్భంగా పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ , ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షులు తోలెం శ్రీను మాట్లాడుతూ, భూమి పూజ కు సంబంధించిన వివరాలను త్వరలోనే  తెలియజేస్తామని రేగా కాంతారావుకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచులు మొగిలిపల్లి నరసింహా రావు, బాడిస మహేష్, కొమరం నారాయణ ఆదివాసీ నాయకులు కాయం శేఖర్, అనిల్ కుమార్, సోలం అశోక్, తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: