CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మౌనిక మౌన పోరాటంలో న్యాయంఉంది

Share it:

 


టీ ఎం ఎం ములుగు జిల్లా అధ్యక్షులు కర్రి శ్యాంబాబు.

 

మన్యం టీవీ మంగపేట.


గత 16 రోజులుగా న్యాయం చేయండని నిరసన వ్యక్తం చేస్తూ తన ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి దళిత బిడ్డ మౌనికకు న్యాయం చేయడానికి దళిత గిరిజన ములుగు ఎమ్మెల్యే సీతక్క ముందుకు రాకపోవడం బాధాకరమని మాల మహనాడు జిల్లా అధ్యక్షుడు కర్రి శ్యాంబాబు అన్నారు. గురువారం మాల మహానాడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయగా శ్యాంబాబు హాజరై మాట్లాడాతు దళిత బిడ్డ మౌనికను ప్రేమ పేరుతో మోసం చేసిన సూర్య వర్మ విషయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఎందుకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దళిత గిరిజన మహిళ అయి కూడా దళిత బిడ్డకు న్యాయం చేయకపోవడం సిగ్గు చేటు అన్నారు. ఎమ్మెల్యే అయి ఉంటే సరిపోదని మహిళలు అన్యాయం జరిగినప్పుడు ముందుండి పోరాటం చేయాలనీ తద్వారా న్యాయం చేయాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలోతెలంగాణా మాల మహానాడు ములుగు జిల్లా తెలంగాణా మాల మహానాడు అధ్యక్షులు అధ్యక్షులు కర్రి శ్యాంబాబు,ప్రధాన కార్యదర్శి గుండాల నర్సయ్య,మండల అధ్యక్షులు ఈద కుమారస్వామి,   టీ.యం ఆర్ పీ ఎస్ జిల్లా అధ్యక్షులు బోడ రాములు,ఎం ఆర్ పీ ఎస్ మండలనాయకులు మందా కొమ్మాలు,లాదాల్ల సాంబయ్య, కుర్రి దినకరణ్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: