మన్యం మనుగడ, పినపాక:
మండలంలోని దుగినేపల్లి గ్రామానికి చెందిన దోమగండి స్వప్న, చీమల అనిత, బానోతు శ్రావణి లకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను శనివారం ఎంపీపీ గుమ్మడి గాంధీ, జెడ్పిటిసి సుభద్రాదేవి లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అని ఈ పథకం ద్వారా ఎంతో మంది పేద కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఆత్మ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, బూర్గంపాడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బిలం సాంబశివరావు ,ఆర్ ఐ వీరభద్రం ,వాసు బాబు, సహకార సంఘం డైరెక్టర్ కామేశ్వరరావు ,బోడ ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: