మన్యం టీవీ, బూర్గంపాడు:. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు రాజకీయవేత్త న్యాయవాది భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని సారపాక పట్టణంలోని బీసీ కార్యాలయంలో నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ని కేవలం వేడుకలకి పరిమితం చేయరాదని అన్నారు. ఆయన ఆశయ సాధనకు యువతరం ముందుకు రావాలని కోరారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన నాడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని అంబేద్కర్ ఆశయ సాధనకు మనమంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి కనకాచారి, ఆకుల రఘు,శ్రీకాంత్, గోవింద్, ఉమామహేశ్వరచారి,సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: