మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో నూతనంగా నిర్మిస్తున్న అంబేద్కర్ సర్కిల్ పనులను గురువారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ,విద్యుత్ శాఖ,ఆర్&బి అధికారులతో అంబేద్కర్ సర్కిల్ పనులపై సలహాలు సూచనలు చేశారు.నూతన డివైడర్ నిర్మాణం,సెంట్రల్ లైటింగ్,పనులపై అధికారుల తో మాట్లాడారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పొశం.నరసింహారావు,మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్,ఏఈ సరిత,విద్యుత్ శాఖ ఏఈ,ఆర్&బి అధికారులు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు,ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి తాళ్లపల్లి. యాదగిరి గౌడ్,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,మండల యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,పట్టణ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి,ముద్దంగుల కృష్ణ, తంత్రపల్లి కృష్ణ,తాత రమణ,మేకల రవి, యువజన నాయకులు, బొశెట్టి రవి ప్రసాద్,గుర్రం సృజన్,టిఆరేస్వి యువజన నాయకులు రాహుల్,చరణ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: