మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోనే అమరారం గ్రామంలో ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షులు పొలం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివాసీల ఆరాధ్యదైవం, కొమరం భీమ్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఆదివాసీల చేత కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన ప్రదేశములో జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్ చేత ఆదివాసి జెండాను ఎగరవేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అమరారం ఎంపిటిసి కాయం శేఖర్, సర్పంచులు మొగిలిపల్లి నరసింహారావు, లక్ష్మి రూపవతి, కృష్ణంరాజు, పోతినేని శివ శంకర్, సుధాకర్, పాండురంగాపురం ఉప సర్పంచ్ పూనెం సాంబశివరావు, ఆదివాసీ నాయకులు జంపన్న, రాజశేఖర్, గొగ్గల కృష్ణ, ఉద్యోగ సంఘాల నాయకులు సోలం అశోక్ , కొమరం నాగేంద్రబాబు, ఆదివాసి యువత తదితరులు పాల్గొన్నారు
Post A Comment: