ఏప్రిల్ 30 వరకు కర్ఫ్యూ అమలు. మన్యం టివీఅశ్వాపురం: అశ్వాపురం మండలం లోని వ్యాపార వాణిజ్య సంస్థలు, ప్రజలు పోలీస్ వారికి సహకరించాలి. ఎమర్జెన్సీ సర్వీసులు, పెట్రోల్ బంకులు, మీడియాకు మినహాయింపు.
అశ్వాపురం సీఐ సట్ల రాజు
దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాత్రి పూట కర్ఫ్యూ మంగళవారం నుండి అమలు చేస్తున్నట్లు అశ్వాపురం సీఐ తెలిపారు.
కరోనా ఉధృతి నేపధ్యంలో వైరస్ నివారణ చర్యలలో భాగంగా రాత్రి పూట కర్ఫ్యూ విధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదని, అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంక్లు, మీడియాకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. రాత్రి పూట 9-00 గంటల నుంచి ఉదయం 5-00 గంటల వరకు కర్ఫ్యూ విధించబడుతుందని ఏప్రిల్ 30 తేది వరకు అమల్లో ఉంటుందని సిఐ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని అశ్వాపురం సీఐ సట్ల రాజు తెలిపారు.
Post A Comment: