CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాజీ మంత్రి చందూలాల్ మృతితో విషాదం

Share it:

 


ములుగు మన్యం టీవీ:

రాష్ట్ర మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వారం రోజుల కిందట అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు. ములుగు మండలం జగ్గన్నపేట పంచాయతీ శివారు సారంగ పల్లి గ్రామానికి చెందిన ఆయన మృతి నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది. సర్పంచ్ నుంచి మొదలైన ఆయన రాజకీయ జీవితంలో అనేక పదవులు నిర్వహించి, ప్రజల మన్ననలను పొందారు. పట్టుదల గల మనిషిగా పేరుంది. ఆయన రాజకీయ జీవితంలో తెలుగుదేశం, టిఆర్ఎస్ పార్టీ అధినేతలు ఎన్టీఆర్, చంద్రబాబు, కెసిఆర్ లతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఆయనకు మొత్తం నలుగురు సంతానంలో ముగ్గురు కొడుకులు అజ్మీరా ప్రహ్లాద్, అజ్మీరా ధర్మ సింగ్, అజ్మీరా ప్రవీణ్, కూతురు పద్మ, భార్య శారద ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కృషి చేశారు. ఆయన మృతితో తెరాస కార్యకర్తలు అభిమానులు తీవ్ర విషాదం నెలకొంది. శుక్రవారం స్వగ్రామంలో  దహనసంస్కారాలు చేయనున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: