👉సీసీ రోడ్లకు 3.25 కోట్లు( మూడు కోట్ల ఇరవై అయిదు లక్షలు) మంజూరు పట్ల హర్షం
👉టీఆరెస్ పార్టీ మండలఅధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్,సర్పంచులు
మన్యం టీవీ, కరకగూడెం:విప్ ,పినపాక శాశన సభ్యులు రేగా కాంతరావు తోనే మారుమూల గ్రామాలు అభివృద్ధి సాధ్యం అని టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ అన్నారు.శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ,పలువురు సర్పంచ్ లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.మారుమూల మండలమైన కరకగూడెం కు విప్ రేగా కాంతరావు అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ.3.25 కోట్లు( మూడు కోట్ల ఇరవై అయిదు లక్షలు) మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో చిరుమళ్ళ సర్పంచ్ పాయం నర్సంహరావు, తాటగూడెం సర్పంచ్ కొమరం విశ్వనాధం రఘునాధపాలెం సర్పంచ్ పోలెబోయిన నర్సంహరావు రెగళ్ళ సర్పంచ్ కుంజ వసంతరావు కొత్తగూడెం సర్పంచ్ గొగ్గలి నాగమణి పద్మపూరం సర్పంచ్ తాటి సరోజినీ చొప్పాల సర్పంచ్ జావ్వజి రాధ వెంకటపూరం సర్పంచ్ పోలెబోయిన సమ్మక్క కన్నాయిగూడెం సర్పంచ్ భూక్య భాగ్య లక్ష్మి పాల్గొన్నారు.
Post A Comment: